పూర్వం ఉమ్మడి కుటుంబాల్లో పిల్లలు ఆట బొమ్మలను తెచ్చుకుని పెళ్ళి ఆట ఆడుకునేవారు. ఆట బొమ్మలకు పెళ్ళి వస్త్రాలు తొడిగి, వియ్యపువారి బొమ్మలను కూడా పెట్టేవారు. పిల్లలందరూ పెద్దల వేషధారణలో వచ్చి కూర్చుంటారు. పెళ్ళిలోని కన్యాదానం, జీలకర్ర-బెల్లం వంటి ఘట్టాలను నిర్వహించి చివరకు వరుడి బొమ్మ చేతికి చిట్టి మంగళ సూత్రాన్ని తగిలించి వధువు బొమ్మ మెడలో పడేలా చేస్తారు. అయితే సంసారపు శిక్షణ ఇచ్చే ఈ ఆట ఉమ్మడి కుటుంబాల విచ్ఛిన్నం, ఆధునిక చధువులు, పాశ్చాత్య పోకడల వల్ల నేడు ఆట పూర్తిగా అంతరించిపోయింది. భారతీయ సంప్రదాయాన్ని, కుటుంబ వ్యవస్థను ప్రతిబంబించే ఈ ఆటను పాశ్చాత్య విష సంస్కృతి ప్రభావానికి గురైన నేటి పిల్లలకు తల్లిదండ్రులు తెలిపరచవలసిన అవసరం ఎంతైనా ఉంది.
PLEASE LET US KNOW IF YOUR IMAGE IS TAKEN BY US. WE WILL REMOVE OR GIVE US PERMISSIONS TO USE.